వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
వచ్చే చవితి తెలంగాణ రాష్ట్రంలోనే….
-పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటామని టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని మొండ్రాయి గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మధుసూదనాచారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ అడ్డంకిగా మారిన సీమాంవూధుల మనస్సు మార్చి తెలంగాణ ఏర్పాటుకు సహకరించేలా దీవించమని వేడుకున్నట్లు తెలిపారు. కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని, వచ్చే సంవత్సరం ఇదే గ్రామంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి 101 కొబ్బరి కాయలు కొడుతానన్నారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్షికమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమర్ఉన్నీసాబేగం, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎడ విజయ, సంగెం మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మహిపాల్, ఆనందంగౌడ్, టీఆర్ఎస్వీ జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, రవి, నీరటి రాజ్కుమార్,అల్లావుద్దిన్, ప్రవీణ్, గ్రామ పెద్దలు బాబు కొమ్మాలు, రాజాలు పాల్గొన్నారు.
Related posts:
- కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం – ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
- తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
- ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
- బాన్సువాడ – ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల – అక్టోబర్ 13న పోలింగ్ – ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ
- తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆత్మబలిదానాల ఉసురు తగులుతుంది – అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె – అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్
Category: News, Telangana, Warangal News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.