వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటాo -రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి
వచ్చే చవితి తెలంగాణ రాష్ట్రంలోనే…. -పొలిట్ బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి వచ్చే చవితి పండుగను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటామని టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని మొండ్రాయి గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మధుసూదనాచారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ అడ్డంకిగా మారిన సీమాంవూధుల మనస్సు మార్చి తెలంగాణ ఏర్పాటుకు సహకరించేలా దీవించమని వేడుకున్నట్లు తెలిపారు. కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని, [...]