అమరవీరుల స్థూపం వద్ద హోరెత్తిన తెలం’గానం’
తెలంగాణ కోసం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి పొన్నాల ఇంటిని ముట్టడించిన విద్యార్థులను పోలీసులు అక్రమ కేసులను నమోదు చేయడం, విచక్షణా రహితం గా కొట్టడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పలు కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్లెక్కారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్ట్స్ కళాశాల, మాస్టర్జీ తదితర కళాశాలల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేశారు.
అమరవీరుల స్థూపం వద్ద మానవహారం నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. నలుమూలల నుంచి కళాశాలలను బహిష్కరించి విద్యార్థులు పోలీసుస్టేషన్ల ముట్టడికి, ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా, విద్యార్థులను వెంబడిస్తు పొలీసులు ఎక్కడి కక్కడే అరెస్ట్లకు పాల్పడుతూ ఆందోళనను అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేశారు. పొలీసులు పెద్దసంఖ్యలో ప్రత్యేక బలగాలను మోహరించడంతో పాటు వజ్రవాహనాలను ఉపయోగించి సైరన్మోతలతో హడలెత్తించారు.
కాగా, గురువారం రాత్రి అమరవీరుల స్థూపం వద్ద పొలిటికల్ జేఏసీ చైర్మన్ పాపిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రావు అమరేందర్రెడ్డిలతో పాటు పలు సంఘాల నాయకులు, న్యాయవాదులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని పోలీసు చర్యలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో మా స్టర్జీ డిగ్రీ కళాశాల టీఆర్ఎస్వీ నాయకుడు బొడ చంటినాయక్, కుమారస్వామి, కరుణాకర్, రజినీకాంత్, నరేందర్, అనిత, రాధిక, సతీష్, మధు, దుప్పటి కిషోర్లతో వందలాదిగా విద్యార్థులు పాల్గొన్నారు.
source from Andhra Jyothi
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.