మాజీ మంత్రి పీవీ రంగారావు మృతి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు మాజీ మంత్రి పీవీ రంగారావు మృతి చెందారు. హిమాయత్నగర్లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోట్ల విజయభాస్కర్రెడ్డి మంత్రివర్గంలో రంగారావు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. వరంగల్ జిల్లా హన్మకొండ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రంగారావు బ్రహ్మచారి. పీవీ రంగారావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Category: Latest News, News


Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.