నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
టెన్త్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 11 వరకూ జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 12,87,736 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తం 5,849 పరీక్ష కేంద్రాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించే క్రమంలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
No related posts.
Category: News, State News



Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.