కేయూ జేఏసీ విద్యార్థులను వెంటనే విడుదల చేయాల – ములుగురోడ్ జంక్షన్లో రాస్తారోకో
కేయూ జేఏసీ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలంటూ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు, గాయత్రి డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎల్బీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం ములుగురోడ్ జంక్షన్లో పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్వీ విభాగం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆందోళన చేపట్టిన విద్యార్థులను అరెస్ట్ చేసి వివిధ పోలీసుస్టేషన్లను, స్టేషన్ల వారీగా విద్యార్థులను కొట్టుకుంటూ తిప్పడం పట్ల విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను కొట్టినందుకు బాధ్యులైన [...]