ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై ఆ ఇద్దరు పోలీసు అధికారులు (కాజీపేట డీఎస్పీ వెంకట్రాం నర్సయ్య, హన్మకొండ సీఐ వెంక అతిగా ప్రవరిస్తున్నారు
ఆ ఇద్దరు అతి చేస్తున్నారు…
-డీఎస్పీ, సీఐపై చర్య తీసుకోండి
-ఎస్పీని కోరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, జాక్నేతలు
‘ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై ఆ ఇద్దరు పోలీసు అధికారులు (కాజీపేట డీఎస్పీ వెంకట్రాం నర్సయ్య, హన్మకొండ సీఐ వెంక అతిగా ప్రవరిస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోండి. లేకుంటే మరి కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్భాస్కర్, పొలిటికల్ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు గురువారం ఎస్పీ రాజేష్కుమార్ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు ఎస్పీతో పలు విషయాలపై చర్చించారు.
మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని ముట్టడించిన సందర్భంగా విద్యార్థులను అరెస్ట్ చేసిన క్రమంలో డీఎస్పీ వారిని ఉద్దేశపూర్వకంగా చిత్రహింసలకు గురిచేయడం సరికాదన్నారు. అంతేగాకుండా తెలంగాణ పేరెత్తితే ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించడం తో విద్యార్థులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. రాజీనామాల పేరి ట డ్రామాలు ఆడుతున్నారనే కారణంగా విద్యార్థులు బుధవారం మం త్రి ఇంటిని ముట్టడించారని, అంతమావూతాన వారు ఇద్దరే పోలీసులు అనే విధంగా మార్క్ చూపించడం సరైంది కాదన్నారు. వెంటనే వారిద్దరిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మే రకు ఎస్పీ స్పందిస్తూ తాను ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని, హింసకు పాల్పడితే ఊరుకునేది లేదన్నట్లు తెలిపారు. నాలుగున్నర కో ట్ల మంది ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారని తప్పకుం డా వారి కల నేరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేసినట్లు వారు పేర్కొన్నారు. ఎస్పీని కలిసిన వారిలో టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, టీజీఏ అధ్యక్షుడు మర్రి యాదవడ్డి, ప్రొఫెసర్ సీతారాం, న్యూడెమోక్షికసీ నాయకులు నూన అప్పారావు తదితరులు ఉన్నారు.
Related posts:
- హన్మకొండ రాంనగర్లోని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని కేయూ విద్యార్థులు ముట్టడించిన సంఘటనలో అరెస్టయిన 17 మంది విద్యార్థులు పోలీసుల చిత్ర హింసల కు విలవిల్లాడి పోయారు.
- కేయూ జేఏసీ విద్యార్థులను వెంటనే విడుదల చేయాల – ములుగురోడ్ జంక్షన్లో రాస్తారోకో
- తెగించి కొట్లాడుతం – తెలంగాణ కోసం ఉద్యమించాలని రాస్తారోకోలు, ధర్నాలు – మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ – లేకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరిక
- హన్మకొండలోని మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇల్లు ముట్టడి
- అమరవీరుల స్థూపం వద్ద హోరెత్తిన తెలం’గానం’
Category: Live TV, Telangana, Warangal News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.